![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -174 లో.....నర్మద, ప్రేమ అక్కలు ఇద్దరు కలిసి నన్ను పది లక్షలు గురించి అడుగుతున్నారని శ్రీవల్లితో బుజ్జి చెప్తుంది. దాంతో శ్రీవల్లి కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏంటి మా చెల్లి ని బెదిరిస్తున్నారట ఎందుకని అడుగుతుంది. పది లక్షల గురించి టెన్షన్ పడుతున్నావ్ కదా ఏంటని అడిగానని నర్మద అనగానే నా గురించి నీకెందుకని శ్రీవల్లి అంటుంది. కదా అయితే ప్రతీదాంట్లో మా విషయాల్లో నువ్వు ఎందుకు దూరుతావని శ్రీవల్లిని నర్మద అడుగుతుంది.
దాంతో శ్రీవల్లి ఏం చెయ్యలేక ఏడుపు మొదలుపెడుతుంది. అప్పుడే వేదవతి వచ్చి అడుగుతుంది. శ్రీవల్లి అక్క ఏదో పది లక్షల గురించి టెన్షన్ పడుతుందని వేదవతికి నర్మద చెప్తుంది. పదిలక్షలు ఏంటని వేదవతి అనగానే.. ఏం లేదు అత్తయ్య, వాళ్ళు కావాలనే చేస్తున్నారని శ్రీవల్లి అంటుంది. శ్రీవల్లిని వేదవతి లోపలికి వెళ్ళమంటుంది. అమాయకరాలిని చేసి ఏడిపిస్తున్నారని నర్మదతో వేదవతి అంటుంది. మీ ముద్దుల కోడలిని ఏం అనలేదని నర్మద, ప్రేమ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత చందు డబ్బు గురించి అడుగుతుంటే.. నన్ను వాళ్ళు తిట్టారంటూ శ్రీవల్లి టాపిక్ డైవర్ట్ చేస్తుంది.
మరొకవైపు ప్రేమ దగ్గరికి నర్మద వస్తుంది. నువ్వు ధీరజ్ ని ప్రేమిస్తున్నావని చెప్తుంది. అదేం లేదని ప్రేమ అంటుంటే.. నువ్వు ధీరజ్ వచ్చాక తన కళ్ళలోకి చూడు అప్పుడు తెలుస్తుందని నర్మద అంటుంది. ధీరజ్ ఇంటికి వస్తాడు. అతనికి భోజనం వడ్డించగా.. థాంక్స్ ప్రేమ అని ధీరజ్ అంటాడు. అలా అనగానే తన కళ్ళలోకి చూస్తూ ప్రేమ మురిసిపోతుంది. పక్కన నుండి నర్మద చూస్తుంటుంది. తరువాయి భాగంలో వేదవతి తన ముగ్గురు కోడళ్ళని పిలిచి కలిసి మెలిసి ఉండమని చెప్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |